అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అటు ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ తో కలిసి గీతగోవిందం సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. దీంతో వీరి కాంబినేషన్ అదుర్స్ అనే టాక్ వచ్చింది.
గీతగోవిందం సినిమా విజయం తరువాత విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్రాల అమ్మకాన్ని ప్రారంభించారు. యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. దుస్తులు వెరైటీగా ఉండటంతో ఆదరణ లభిస్తోంది. కేవలం ఇప్పటి వరకు మగవాళ్లకు సంబంధించిన డ్రెస్ లను మాత్రమే రౌడీ బ్రాండ్ లో దొరుకుతున్నాయి. త్వరలోనే లేడీస్ వేర్ కూడా రౌడీ బ్రాండ్ లో రాబోతున్నది. దీనికోసం హీరోయిన్ రష్మికను తన పార్ట్నర్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సౌత్ మొత్తం తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నారు. గీతగోవిందం సినిమా నుంచి ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. దీంతో ఇద్దరు కలిసి మరిన్ని సినిమాలు చేయాలని అనుకున్నారట.
ఇందులో భాగంగానే ఇప్పుడు డియర్ కామ్రేడ్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్ షిప్ తో ఆమెకు తన బిజినెస్ లో భాగస్వామ్యం ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే.. ఇంకా బాగుంటుందని,మంచి బ్రాండింగ్ కూడా వస్తుందని భావిస్తున్నారు. కేవలం ఫ్రెండ్ షిప్, బిజినెస్ వరకు మాత్రమే కలిసి పనిచేస్తారా లేదంటే ఫ్యూచర్స్ లో ఒక్కటవుతారా చూద్దాం.