తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు సందీప్ వంగ. కబీర్ సింగ్ అంటూ హిందిలో పెద్ద సంచలనమే సృష్టించాడు సందీప్. షాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమాతో డైరక్టర్ సందీప్ వంగకు మంచి క్రేజ్ ఏర్పడింది. కబీర్ సింగ్ తర్వాత మళ్లీ తెలుగు సినిమానే చేస్తాడని అనుకున్న సందీప్ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నాడట.


అసలైతే సందీప్ వంగ తెలుగులో మహేష్ తో సినిమా చేస్తాడని అన్నారు. కాని ఆ కాంబినేషన్ మూవీ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా సందీప్ వంగ రణ్ బీర్ కపూర్ తో సినిమా చేస్తాడని టాక్. సనీప్ ఈమధ్య డెవల చేసిన ఓ క్రైం స్టోరీ రణ్ బీర్ కపూర్ కు బాగా నచ్చిందట. ఆ కథతో వీరి కాంబినేషన్ మూవీ వస్తుందని అంటున్నారు.


మొదటి సినిమానే అయినా తెలుగులో అర్జున్ రెడ్డి అదే సినిమా బాలీవుడ్ రీమేక్ తో సూపర్ హిట్ కొట్టాడు. అందుకే అతనితో సినిమా కోసం బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రణ్ బీర్ సింగ్ కు సందీప్ వంగ స్టైల్ ఆఫ్ మేకింగ్ నచ్చడంతో అతనితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. ఈ కాంబినేషన్ మూవీకి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వరలో వస్తుందని తెలుస్తుంది.


వర్మ తరహాలో మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ. అయితే ఆర్జివిలా అతను కూడా అక్కడ కొన్నాళ్లు కెరియర్ కొనసాగించేలా ఉన్నాడు. ఒకవేళ రణ్ బీర్ సింగ్ సినిమా కూడా హిట్టైతే మాత్రం సందీప్ వంగ ఇక బాలీవుడ్ డైరక్టర్ అయినట్టే లెక్క. మరి అతనితో చేసే క్రైం థ్రిల్లర్ కథ ఎలా ఉంటుందో దాని కథాంశం ఏంటన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: