టాలీవుడ్ లో క్రేజీ కాబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు అల్లూ అర్జున్, త్రివిక్రమ్ లు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ రోజు విడుదలైన ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ భారీ అంచనాలనే పెట్టుకుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ కి సరైన హిట్ దొరకక పోవడమే అందుకు కారణం. ఇప్పటికే ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులు ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ హిట్టు కొట్టేసిందని అంటున్నారు..అయితే...
ఈ సినిమాలో బన్నీ తన మావయ్య చిరంజీవిని ఒకానొక సందర్భంలో హైలెట్ చేసి చెప్పే డైలాగు అందరితో ఈలలు, గోలలు చేయించింది. ఆయనకు మనం అభిమానులం అయినా మనమందరం గుర్తుంటామా అని అంటూ వచ్చే డైలాగ్ కేకే పుట్టించింది..ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ సెకండాఫ్లో విలన్ సుముద్రఖని కొడుకుతో జరిగే మీటింగ్ లో అందరు హీరోల సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ వేయిస్తాడు. అయితే ఎన్టీఆర్తో సహా అందరి హీరోల పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు మా పవన్కళ్యాణ్ సాంగ్కు డ్యాన్స్ చేయమని అడుగుతాడు. దాంతో బన్నీ సిచ్యుయేషన్ డిమాండ్ చేయడం లేదని అంటాడు...
సిచ్యుయేషన్ పవన్కు కావాలా అని సునీల్ అడుగుతాడు. ప్రతీ హీరో సినిమా పాటకి అడ్డు చెప్పకుండా డ్యాన్సులు చేసిన బన్నీ పవన్ పాటకి మాత్రం సిచ్యుయేషన్ డిమాండ్ చేయడంలేదని చెప్పడంతో పవన్ పై బన్నీ కి ఉన్న కోపాన్ని, అసహనాన్ని మరో సారి సినిమా రూపంలో వ్యక్త పరిచినట్టయ్యింది. అసలు ఆ సీన్ లో ఎదో సెటైరికల్గా పవన్ పాటకు కావాలని బలవంతంగా డ్యాన్స్ వేసినట్టు అనిపించింది. గత కొన్నేళ్లుగా అల్లూ అర్జున్ కి, పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ వచ్చిన విషయం విధితమే..
బన్నీ గతంలో కూడా కొన్ని సినిమా ఫంక్షన్ లలో పవన్ కళ్యాణ్... పవన్ కళ్యాణ్...అంటూ అభిమానులు అల్లరి చేస్తుంటే వారిపై బన్నీ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొన్నటికి మొన్న నాకు నచ్చిన హీరో చిరంజీవి గారు ఆ తరువాత రజనీకాంత్ అంటూ ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారమే రేపాయి. మరి తాజాగా అల వైకుంఠపురములో సైతం పవన్ కళ్యాణ్ పై వేసిన సెటైర్ పై పవన్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి..