యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ చూపిన శ్రద్ధ, చొరవ బాగున్నాయని, ఆలయం దేశంలో అతి పెద్ద ఖ్యాతి పొందడం ఖాయమని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ ను జగన్ ను ఉద్దేశించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అధిపతులూ తనకు రెండు కళ్లలాంటి వారు అని చెప్పిన స్వామిజీ సడెన్ గా రూటు మార్చారు. అయితే జగన్ వీటిపై మాట్లాడకపోయినా కొత్త స్వామిజీని కొలవడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
స్వరూపానందేంద్రను దూరం చేసుకుని హిందువుల ఓట్లను మరింత దూరం చేసుకుంటున్నారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. గతంలో విశాఖ శారదా పీఠాన్ని తరుచూ సందర్శించి, స్వామికి కానుకలు సమర్పించిన జగన్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయా రు. మరో వైపు హిందూ ఆలయాల పరిరక్షణపై జగన్ చూపుతున్న శ్రద్ధ పై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిపై స్వామిజీ ఇంతవరకూ మాట్లాడకున్నా జగన్ తీరుకు సంబంధించి మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రధాన ఆలయాల నిర్వహణలో తరుచూ విమర్శల పాలవుతున్న జగన్, వాటిని నియంత్రించండంలో విఫలం అవుతున్నారన్నది ఓ విమర్శ. పాలనలో పారదర్శకత, అన్ని మతాలను గౌరవించే విధానం అన్నవి మాటలు వరకే పరిమితం అయి చేతల్లో లేవన్నది స్వామీజీ ఉద్దేశం అయి ఉంటుంది. అందుకే జగన్ ను కాదని కేసీఆర్ ను పొగుడుతున్నారు స్వామీజీ.