2014 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపికి సపోర్ట్ చేసింది. ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం - బిజెపి - జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఓట్లు చీల్చి పోవడంతో వైసిపి రికార్డు మెజార్టీతో విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారు.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో తమకు సీటు ఉండదని.. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల్లో ఉంటున్నాం... రేపటి రోజున జనసేన తో పొత్తు ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏం అవుతుందని వారు వాపోతున్నారు.
ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా తో పాటు ఉభయ గోదావరి జిల్లాలు - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే కాస్త ఆందోళనతోనే ఉన్నారు. ఈ పొత్తు ఎక్కడ తమ కొంప కొల్లేరు చేస్తుందో అన్న భయంతో వారిలో ఉంది. పొత్తు కుదిరితే ఆ పొత్తులో బీజేపీ కూడా ఉంటే టీడీపీ లో దాదాపు 40 మందికి పైగా నేతలు తమ సీట్లు త్యాగం చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. మరి ఏం జరుగుతుం దో ? చూడాలి.