కామంతో రెచ్చిపోతున్న దుర్మార్గులకు వావి వరుసలు మరచి పోతున్నారు.. కంటికి కనిపించిన అమ్మాయిని కోరుకుంటున్నారు.. ఆ అమ్మాయి తో పొందు కావాలనే దుర్మార్గపు ఆలోచనలో యువత ఉన్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలను తీసుకొస్తున్న కూడా కామాంధుల తీరు మారినట్లు కనిపించలేదు. కొందరి ప్రేమించానని దారుణానికి పాల్పడుతున్నారు. మరి కొందరు ప్రేమ ఫలించలేదు అని ప్రాణాలను విడిచేస్తున్నారు.. మరో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి పై మా కులం కాదు అంటూ చంపేస్తున్నారు.. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి..



ఓ వ్యక్తి తన చెల్లెలిని ప్రేమించాడని అక్కసుతో అమ్మాయి తరపువాల్లు ఆ అబ్బాయి పై దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది..వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది..అనంతపురం జిల్లా హిందూపురం లోని మోడల్ కాలనీకి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ విషయం ఇంట్లో తెలియడంతో పిల్లలిద్దరూ ఇష్టపడ్డారన్న ఉద్దేశం తో వివాహం చేయాలని యువకుడి తల్లిదండ్రులు కోరినట్లు తెలుస్తోంది.



చెల్లి అలా ప్రేమించడం నచ్చని అన్న అతని అడ్డును తొలగించుకోవాలని అనుకున్నాడు.. పెళ్లి చేయమని అడగడంతో మరింత కోపాన్ని పెంచుకున్నాడు.యువకుడి తండ్రి చాంద్‌బాషాపై కత్తి తో దాడి చేశాడు. తన స్నేహితుడు వాసింతో కలసి కాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా పొడిచేశాడు. అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గాయాలు బాగా తగలడంతో రక్తం బాగా పోయిందని చెప్పారు.అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.. నడవలేని పరిస్థితి తలెత్తింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు.. చాంద్ భాష పై దాడి చేసింది తానే అని నేరం ఒప్పుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: