మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సభ్య సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన వారు సైతం అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్న ఘటనలు  ప్రస్తుతం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. సాధారణంగా ఒక మహిళకు సమస్యలు వస్తే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్తే తన సమస్య తీరిపోతుంది అని భావిస్తుంది కానీ ఇక్కడ మాత్రం తల్లిదండ్రులే చిన్నారికి సమస్యగా మారి పోయారు. సమస్య వస్తే పరిష్కరించాల్సిన పోలీసులే ఆ చిన్నారిని చిదిమేశారు. అభం శుభం తెలియని చిన్నారిని వ్యభిచార కూపంలోకి దింపి నరకం చూపించారూ.




 ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బయట పోవడంతో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. వాషర్ మెన్ పేటకు చెందిన 13 ఏళ్ల బాలిక అయిన వాళ్ళ చేతిలోనే ఆటబొమ్మ గా మారిపోయింది. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే ఏకంగా కూతురు శరీరంతో వ్యాపారం చేశారు. వద్దు వద్దు అని కాళ్లావేళ్లా పడి ఎంత వేడుకున్నప్పటికీ ఆ తల్లిదండ్రుల మనసు మాత్రం కడగలేదు.... ఏకంగా వ్యభిచార రొంపిలోకి దింపి.. పున్నామ నరకం చూపించారు. ఆడుకోవాల్సిన వయసులో వ్యభిచారం చేయించారు.




 అంతేకాదు సదరు బాలికకు న్యాయం చేయాల్సిన అధికారులు సైతం ఆమె పై కన్నేసి కామకోరికలు తీర్చుకోవడం మరింత అమానుశంగా  మారిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు పోలీస్ కమిషనర్. అంతేకాదు ఇన్స్పెక్టర్ సహా ఎనిమిది మంది పోలీసులను అరెస్టు చేసి కటకటాల వెనుక తోసారు. సదరు బాలిక తల్లిదండ్రులతోపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: