అయితే ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన నలుగురిలో కూడా ముగ్గురు అభ్యర్థులు నేర చరిత్ర కలిగిన వారి అంటూ చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల క్రితం దళిత యువకుడికి శిరోముండనం చేసి దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి గా పేరుగాంచిన తోట త్రిమూర్తులునూ సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రతిపాదించడం దారుణం అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అయితే త్రిమూర్తులు పై ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ ప్రతిపాదించిన మరో అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డి పై కూడా ఎంత నేరచరిత్ర ఉందో అందరికీ తెలుసని.. గతంలో గుంటూరులో మిర్చి యార్డు తగలబెట్టిన వారిలో ప్రముఖంగా లేళ్ల అప్పిరెడ్డి పేరు వినిపించింది అంటూ వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు. ఇక జగన్ ప్రతిపాదించిన మూడో అభ్యర్థి రమేష్ యాదవ్ సైతం గతంలో ఒక హత్య కేసులో విచారణ సైతం ఎదుర్కొంటున్నట్లు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇలా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన నలుగురిలో ముగ్గురు తీవ్రమైన నేరచరిత్ర కలిగిన వారిని ఇక గవర్నర్ ఎమ్మెల్సీ కోట కింద ప్రతిపాదించిన వారిలో ఈ ముగ్గురిని తిరస్కరించాలి అంటూ లేఖలో గవర్నర్ను కోరారు వర్ల రామయ్య.