అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏదో  ఒక పని చేస్తూ ఉంటే చివరికి అదృష్టం వివరించి ఏకంగా కోటీశ్వరుడిగా కూడా మారిపోతూ ఉంటారు. ఇలా కేవలం ఒక్క రాత్రిలోనే కోట్లకు అధిపతులు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  అప్పటివరకు ఏకంగా పేదరికంలో మగ్గి ఎన్నో కష్టాలు పడిన వారు ఇక అదృష్టం తలుపు తట్టి ఒక్క రాత్రిలో కోటేశ్వరులుగా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునీ చివరికి  లక్ష్మీదేవి కరుణించడం తో కోటీశ్వరుడు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  అయితే అతను చేయాలనుకున్నది ఒక పని కానీ అక్కడ జరిగింది మాత్రం ఇంకో పని. అనుకోని విధంగా అతనికి అదృష్ట లక్ష్మి వరించింది. ఏకంగా కోటీశ్వరుడు గా మారే ఛాన్స్ అతనికి వచ్చేసింది. పొరపాటున లాటరీ గెలిచాడు  ఏమో అని అనుకుంటున్నారేమో అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే అలాంటి లాటరీ ఏం అతనికి వరించలేదు.. మరి అదృష్టం ఎలా కలిసి వచ్చింది అని అంటారా..  అతను బాత్రూం కట్టడానికి తవ్వకాలు ప్రారంభించాడు. అంతలో భారీగా బంగారం బయట పడింది.



 దీంతో అందరూ అవాక్కవాల్సిన  పరిస్థితులు ఏర్పడ్డాయి   ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాత్రూమ్ నిర్మాణం కోసం కొంత మంది కూలీలు పునాదులు తవ్వడం మొదలుపెట్టారు.. అలా బాత్రూం కోసం తవ్విన తవ్వకాలు అతనికి అదృష్టం రూపంలో కలిసి వస్తుంది  అని మాత్రం ఊహించలేకపోయాడు సదరు వ్యక్తి. ఇలా తవ్వకాలలో ఊహించని రీతిలో బంగారు నాణేలు బయటపడ్డాయి. అయితే కూలీలు మాత్రం కాస్త కక్కుర్తిగా ఆలోచించారు. ఈ విషయం అటు యజమానికి తెలియకుండా  ఆ బంగారు నాణాలను దాచిపెట్టారు. ఆ తర్వాత బంగారు నాణాలను పంచుకోవాలి అనుకున్నారు. కానీ పంపకం విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ బంగారు నాణాలను స్వాధీనం చేసుకొని కూలీలను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో సదరు ఇంటి యజమానికి చేతిదాకా వచ్చిన అదృష్టం చేజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: