వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు సేకరించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 2014 నుంచి 2019 వరకు 21,122 కోట్ల రూపాయల అప్పును సేకరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021 మార్చి 31వ తేదీ నాటికి 29 కార్పొరేషన్ల ద్వారా రూ. 1,19,230 కోట్లకు గ్యారంటీ ఇచ్చి.. రూ.1,05,866 కోట్లను రుణంగా సేకరించింది. ప్రస్తుతం ఈ అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. తాజాగా వచ్చిన లేఖతో ఇప్పుడు ఆర్ధిక శాఖ అధికారులు ఏం చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు సేకరించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 2014 నుంచి 2019 వరకు 21,122 కోట్ల రూపాయల అప్పును సేకరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021 మార్చి 31వ తేదీ నాటికి 29 కార్పొరేషన్ల ద్వారా రూ. 1,19,230 కోట్లకు గ్యారంటీ ఇచ్చి.. రూ.1,05,866 కోట్లను రుణంగా సేకరించింది. ప్రస్తుతం ఈ అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. తాజాగా వచ్చిన లేఖతో ఇప్పుడు ఆర్ధిక శాఖ అధికారులు ఏం చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు.