కొత్తగా ఏర్పడిన తెలంగాణ కు వరుసగా రెండు సార్లు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. తొలి ఎన్నికల్లో ఓ మోస్తరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2018 ముందస్తు ఎన్నికల లో ఏకంగా 88 సీట్లతో తిరుగులేని మెజార్టీతో వరుసగా రెండో సీఎం అయ్యారు. రెండో సారి సీఎం అయ్యాక ఆయన మరింతగా బలపడ్డారు అన్నది మాత్రం నిజం. ఇక 2023 సాధారణ ఎన్నికల లో మూడోసారి మరింత మెజారిట వస్తుందని ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెపుతున్నారు.
ఇక కులాల వారీగా ఓటు బ్యాంకును టీఆర్ ఎస్ ను పదిల పరుచు కుంటూ వస్తోంది. దళిత బంధు పథకం దేశంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పథకంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులు అందరూ గులాబీ పార్టీకి వన్ సైడ్ గా ఓట్లేస్తారని లెక్కలు వేస్తున్నారు. కొత్త జిల్లా ల ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ఇక ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా దానిని కాంగ్రెస్, టీఆర్ ఎస్ రెండు చీల్చుకోనున్నాయి . అదే జరిగితే కేసీఆర్ కు మూడో సారి కూడా గెలుపు పక్కాయే అవుతుంది.