ఇక ఇప్పుడు మరో సారి అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది దీంతో రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేదానిపై ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆడుతూ ఉండటం గమనార్హం. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేస్తాడు అని అందరూ భావించారు. కానీ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయిన విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యు రూపంలో పెవిలియన్ చేరాడు.
అయితే న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యు రూపంలో వికెట్ కోల్పోవడం వివాదాస్పదంగా మారి పోయింది. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అవుట్ అంటూ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న కెప్టెన్ కోహ్లి డిఆర్ఎస్ కోరాడు. అందులో బంతి మొదట బ్యాట్ కి తగిలింది అని స్పష్టం గా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అవుట్ గా ప్రకటించాడు.