కరోనా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెప్తూ వస్తుంది. అయినా సరే చాలా మంది మాస్క్ ధరించడానికి ముందుకు రావడం లేదు. ఏ విధంగా అవగాహన కల్పించినా సరే మారడ౦ లేదు జనాలు. 

 

ఈ తరుణంలో ఒక జంట పెళ్లి చేసుకోవడానికి గానూ మాస్క్ లు ధరించి అందరికి ఆదర్శంగా నిలిచింది. కాన్పూర్ లోని గురుద్వారాలో ఒక జంట ముఖం మొత్తం కవర్ అయ్యే విధంగా మాస్క్ ధరించింది. ఈ ఫోటో ఇప్పుడు జాతీయ మీడియాలో హైలెట్ అయింది. తాము కలకలం కలిసి బ్రతకాలి అనుకుంటున్నాం అని, అందుకే కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: