ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ వేగంగానే వ్యాప్తి చెందుతున్నా కోలుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 95,32,038 కేసులు నమోదయ్యాయి. వీరిలో 51,78,999 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
ప్రస్తుతం 38,67,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 38,09,830 మంది త్వరలో కోలుకుని డిశ్చార్జ్ కానున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం కరోనా సోకిన వారిలో దాదాపు 94 మంది కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా అదేస్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఉండటం శుభపరిణామం. 

మరింత సమాచారం తెలుసుకోండి: