ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ళ పట్టాలు అందించే విషయంలో అధికార వైసీపీ అనుసరిస్తున్న తీరుపై ఇప్పుడు విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీలో అవకతవకలు, తమ హయాంలో నిర్మించిన ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలి అనే నినాదంతో టీడీపీ వర్చువల్ ఉద్యమం కి శ్రీకారం చుట్టింది. 

 

అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన గృహ నిర్మాణాలను తెలుగుదేశం పార్టీ ప్రసారం చెయ్యాలని భావిస్తుంది. అక్కడికి నేరుగా నేతలు వెళ్లి వాటిని పరిశీలిస్తారు. కాగా ఏపీలో ఇళ్ళ పట్టాలను కరోనా కారణంగా వాయిదా వేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. త్వరలోనే ఇళ్ళ పట్టాలను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అందిస్తామని స్పష్టం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: