వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూలు ప్రకటించింది. పరీక్షలు సోమవారం నుంచే జరగాల్సి ఉన్నా.. వర్షాలతో వాయిదా పడ్డాయి.పీజీ ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీకి ఆలస్య రుసుము లేకుండా ఆన్​లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 23 వరకు పొడిగించినట్టు కన్వీనర్ కిషన్ తెలిపారు.



 ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్​టీయూహెచ్​లోని ఎంఏ, ఎం​కాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీఈటీ జరగనుంది.ఆలస్య రుసుము రూ.500 రూపాయలు చెల్లించి ఈ నెల 29 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: