తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ బంధువు భరత్ యాదవ్ హత్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వైసిపి కార్యకర్తలు గత రాత్రి కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భరత్ యాదవ్ మృతిచెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భరత్  యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.

 వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో 5హత్యలు జరగడంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు.  ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ప్రశాంతమైన తిరుపతిని ఫాక్షన్ ప్రాంతంగా మార్చడంపై  ఆయన విమర్శలు చేసారు.  భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి ప్రబల నిదర్శనంగా చంద్రబాబు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: