అక్కినేని
నాగచైతన్య లవ్ స్టోరీ
సినిమా కి బ్యాడ్ లక్ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ చిత్రం గత ఏడాది
డిసెంబర్ లోనే పూర్తయినా కూడా మంచి విడుదల తేదీ కోసం చూసి చివరికి ఏప్రిల్ 16వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. చిత్ర రెండవ దశ
కరోనా రావడంతో ఈ
సినిమా విడుదలను పోస్ట్
ఫోన్ చేయక తప్పలేదు. ఆరు నెలలు గడిచిన తర్వాత ఈ చిత్రాన్ని
సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ నేపథ్యంలో ఆరోజున ఇతర పెద్ద సినిమాలు ఓ టీ టీ లో విడుదల అవుతుండటంతో తమ సినిమాలను విడుదల చేయలేక పోయారు చిత్రబృందం.
దీంతో మరొక తేదీ కోసం చూడ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే
సెప్టెంబర్ 24వ తేదీన తమ చిత్రాన్ని విడుదల చేయాలని భావించి అధికారిక ప్రకటన చేశారు. మంచి రోజూ ఎంచుకుని మంచి పని చేశారని ప్రశంసలు రావడంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టుంది చిత్రబృందం. ఇక ప్రీ రిలీజ్
ఈవెంట్ ను కూడా చేయాలని భావించింది అయితే
సెప్టెంబర్ 19 వ తేదీన ప్రీ రిలీజ్
ఈవెంట్ చేయాలని డేట్ ఫిక్స్ చేయగా ఆరోజు
మెగాస్టార్ చిరంజీవిని కూడా ముఖ్యఅతిథిగా పిలిచింది.
అయితే ఈ సినిమాకి ఉన్న బ్యాడ్ లక్ దృష్ట్యా ఆ రోజున ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ జరగడం లేదని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండా ఆ రోజును వేరొక పనికి షెడ్యూల్ చేయడంతో ఈ చిత్ర రిలీజ్
ఈవెంట్ కూడా పోస్ట్
ఫోన్ చేయక తప్పలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ
సినిమా కు ముఖ్య అతిథిగా
మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని వార్తలు రావడంతో ఇప్పుడు దీన్ని పోస్ట్
ఫోన్ చేశారు. 21వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ ఉంటుందని సమాచారం.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా పవన్ సంగీతం సమకూర్చారు.