తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు  ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి అనే బోల్డ్ కథాంశంతో  కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.



 ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ రౌడీ హీరో కు మాత్రం నిరాశే ఎదురైంది. ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు పూరి తో కలిసి లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో కనిపిస్తున్నాడు.. ఇంతకుముందు సినిమా లతో పోల్చి చూస్తే తన లుక్ మొత్తం మార్చేసాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ విడుదలవ్వగా ప్రేక్షకులందరూ మురిసిపోయారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇటీవలే ఒక వార్త మరోసారి వైరల్ అయింది.



 విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో విజయ్ తో బాక్సింగ్ రింగ్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తలపడనున్నాడట. అయితే  మైక్ టైసన్ పాత్రకు టాలీవుడ్ నటసింహం బాలయ్య డబ్బింగ్ చెప్పబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ డైలాగ్ చెబితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బాలకృష్ణ డబ్బింగ్ చెప్పబోతున్నాడు అనడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి డబ్బింగ్ చెప్పడం లేదట. అసలు చిత్ర బంధం కూడా దీనికి సంబంధించి ఎలాంటి సంప్రదింపులు కూడా జరపలేదట. అటు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అంటూ మరో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: