ది కేరళ స్టోరీ సినిమాపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వినూత్నంగా స్పందించారు. మీ కేరళ కథ కావచ్చు.. కానీ మా కేరళ కథ మాత్రం కాదంటూ ఆయన చురకలు అంటించారు. మూవీని నిషేధించాలని మాత్రం కోరుకోవడం లేదన్న శశిథరూర్‌.. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే దానికి వాల్యూ ఉండదన్నారు. ఈ సినిమా వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని చెప్పే హక్కు కేరళవాసులకు ఉందన్నారు శశి థరూర్‌.కేరళ వ్యతిరేక శక్తులు విద్వేషపూరితంగానే ఈ మూవీని తీశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. కేరళ ఖ్యాతిని తగ్గించే కుట్ర ఈ సినిమా అన్నారు. మతపరమైన విభజన ఇంకా ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశం ఉందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. మత సామరస్య వాతావరణానికి విఘాతం కలిగిస్తూ మతతత్వ విషబీజాలు నాటేలా సంఘ్‌ పరివార్‌ ప్రయత్నిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఈ సినిమాపై ఎంతగానో విరుచుకుపడ్డారు.ఇక కేవలం ఈ సినిమా కథ నచ్చడం వల్లే  చేశాను తప్ప తనకు మరో ఉద్దేశం లేదన్నారు కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ.


మంచి కథ అని ఫీల్‌ అయి మాత్రమే సినిమా చేశానన్నారు. ఈ మూవీ చేయడంపై తమ కుటుంబసభ్యులు కూడా గర్వంగా ఫీలయ్యారని తెలిపింది అదా. ప్రజలకు తెలియాల్సిన కథలో తాను నటించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించినందుకు వందల కొద్దీ బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని అదాశర్మ ఎంతగానో వాపోయింది. ఈ మూవీలో షాలిని ఉన్నికృష్ణన్ మతం మార్చుకొని ఫాతిమాగా ఎలా మారింది? ఇక చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందనేది కథతో తీశారు. అందులో షాలినిగా అదా శర్మ చాలా బాగా నటించారు.ఇక తన పై వస్తున్న విమర్శల మీద డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కేవలం ఉగ్రవాదం మీద తీశాను, ఉగ్రవాదానికి మతం లేనప్పుడు ఆ వాదన ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ముందు సినిమాను చూడండి.. ఆ తర్వాత నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: