తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటిగా మారిన సొగసుల సుందరి రష్మిక మందన్న. చలో సినిమాతో తన అందాన్ని పరిచయం చేసింది. తరువాత గీత గోవిందం సినిమాతో స్టార్ ఇమేజ్ ని మరియు గుర్తింపును తెచ్చుకుంది. డియర్ కామ్రేడ్ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మొన్ననే రిలీజ్ అయ్యి హిట్ సొంతం చేసుకున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మరో మారు తన గ్లామర్ను మరియు నటనా కొంటెతనాన్ని పరిచయం చేసింది.

IHG

ప్రస్తుతం తమిళంలో కార్తీ హీరోగా మరియు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం లో మొదటిసారిగా కోలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఆమె చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుండడం తో దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ అమ్మడు తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పా మూవీలో తాను అల్లు అర్జున్ తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్ కి పరిమితమైన పుష్పా టీమ్ లాక్ డౌన్ తరువాత సినిమాను సెట్స్ పై కి తీసుకువెళ్లనున్నారు.

 

IHG

 

హోమ్ క్వారంటైన్ లో ఉన్న రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరించే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా అభిమానులు అడిగే ధర్మ సందేహాలకు తానూ బదులిస్తోంది. ఇందులో భాగంగానే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు షాక్ తిందంట. ఆ అభిమాని ఆమెను “పుష్ప నుండి వేరే యాస నేర్చుకుంటున్నారని తెలిసింది... ఇది నిజమా?" అని అడిగినప్పుడు ఆశ్చర్యపోయిన నటి, “అవును, అయితే మీకు ఎలా తెలుసు?” అని ఆశ్చర్యంగా అడిగిందంటా, అయితే ఈ అమ్మడు లాక్ డౌన్ లో తానూ చిత్తూరు  యాసను నేర్చుకుంటున్నట్లు ఒప్పుకుంది. పుష్పా మూవీ మేకర్స్ అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్పా మూవీ కి సంబంధించి ఫస్ట్ లుక్ కి సంబంధించి రెండు ఫోటోలను ఇప్పటికే  విడుదల చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: