బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.. ఒక్కరోజు వ్యవధిలోనే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. సీనియర్ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు.   కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. తన తండ్రి రిషి కపూర్ చివరి చూపు కోసం ఆయన కుమార్తె రిద్ధిమా కపూర్ ఢిల్లీ నుంచి ముంబైకి రోడ్డు మార్గంలో బయలు దేరిన విషయం తెలిసిందే.  తన తండ్రి ఆసుపత్రిలో చేరారన్న వార్త అందిన వెంటనే రిద్ధిమా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ముంబై బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చార్టర్డ్ ఫ్లైట్ లో ముంబై వెళ్లేందుకు అనుమతి కోసం నిన్న రాత్రే కేంద్ర హోం మంత్రిత్వ శాఖను వీరు సంప్రదించారు.

 

కాకపోతే వాయుమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిని కేవలం హోం మంత్రి అమిత్ షా మాత్రమే ఇవ్వగలరని అధికారులు చెప్పడంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి తీసుకున్నారు.   ఈ నేపథ్యంలో భర్త, కుటుంబసభ్యులతో కలిసి రిద్ధిమా కపూర్ రోడ్డు మార్గంలో పయనిస్తున్నారు. ఢిల్లీ, ముంబై మధ్య ఉన్న దూరం 1,400 కిలోమీటర్లు బయలు దేరారు.  సాయంత్రం 5 గంటలలోగా అంత్యక్రియలు ముగించాలన్న ముంబై పోలీసుల నిబంధననుసరించి రిద్ధిమా చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది.

 

దాంతో రిషీ కపూర్ గారాల పట్టి రిద్ధిమా కపూర్ కడసారి తన తండ్రిని చూసుకోలేకపోయింది.  కాగా,   ముంబై చందన్‌వాడి శ్మశానవాటికలో రిషీ కపూర్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు హాజరై…అంతిమ వీడ్కోలు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: