భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అందరు నటీనటులు కోరుకుంటాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్లో వర్క్ చేయాలని ఆశపడుతుంటారు. జక్కన్న తన ఆలోచలను సినిమాలుగా మలిచి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో అనే సస్పెన్స్‌కు తెరదించాడు. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' తర్వాత తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటించబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఎప్పటి నుండో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. పదేళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి.

 

ప్రస్తుతం రాజమౌళి లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన పనులు మరియు తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారత కి సంబంధించిన కొన్ని ఐడియాస్ డెవలప్ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. కాగా మహేష్ మూవీ తర్వాత ఆయన మహాభారత మూవీని తెరకెక్కించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కూడా పూర్తి కాకుండానే ఆయన మహాభారతంకు సంబంధించిన ఆలోచనలు చేయడం చూస్తుంటే ఆయన రానున్న ఐదేళ్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని అనిపిస్తుంది. మహాభారతంలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించే అవకాశం కలదు. ఎన్టీఆర్ కి మహాభారతంలో ఓ కీలక రోల్ ఉంటుందని రాజమౌళి చాలా కాలం క్రితమే హింట్ ఇచ్చారు. కాబట్టి మహేష్ మూవీ తరువాత మహాభారత మొదలుపెడితే అందులో ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఓ పాత్ర ఉంటుంది. ఇదే కనుక నిజమైతే వీరి కాంబోలో రాబోయే ఐదో సినిమా అవుతుంది. వీరి కాంబోలో ఇప్పటికే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: