రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిన్న మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ఈఛాలెంజ్ ను స్టార్ట్ చేయగా ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇటీవల ప్రభాస్ ,పెద్దనాన్న కృష్ణం రాజు కూడా ఈఛాలెంజ్ ను పూర్తి చేసి ప్రభాస్ ను నామినేట్ చేశాడు. అందులో భాగంగా ప్రభాస్ నిన్న ఈఛాలెంజ్ ను స్వీకరించి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ ,రానా ,శ్రద్దా కపూర్ ను ఈఛాలెంజ్ కోసం నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ ,పేస్ బుక్ ద్వారా ప్రకటించాడు. 
 
 
ఇదిలావుంటే ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలకానుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడగా ఆగస్టు నుండి తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: