టాలీవుడ్ లో గత కొంత కాలంగా పూజా హెగ్డే హవా నడుస్తుంది. పూజా హెగ్డే ఎంత డిమాండ్ చేసినా సరే దర్శక నిర్మాతలు ఆమెకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. దీనితో పూజ కూడా ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త ఎక్కువగానే దృష్టి పెడుతుంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే సినిమాల్లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంది అనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరిగింది. ఏదైనా మంచి కథ ఉంటే నిర్మాతగా పెట్టుబడి పెడతా అని ఆమె చెప్పినట్లుగా తెలిసిందే. అయితే ఆమెకు మాత్రం ఆశించిన స్థాయిలో మంచి కథలు మాత్రం రాలేదు అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఉంది.

అయితే ఇప్పుడు దర్శకుడు ఆమెకు ఒక మంచి కథ చెప్పినట్లుగా సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమాను నిర్మాతగా మొదలుపెట్టవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇది వెబ్ సీరీస్ గా కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. కథను రెండు విధాలుగా సదరు రచయిత వ్రాసాడని దీనితో ఆ కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే దానిపై పూజా హెగ్డే కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తుంది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీని విషయంలో త్వరలోనే ఆమె ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ఆమె బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన ఒక స్పష్టత రానుంది. ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు కూడా  కరోనా వైరస్ కారణంగా ఆగిపోయాయి. ఆమె ప్రభాస్ హీరోగా ఒక సినిమా లో చేస్తుంది. మరో సినిమా అఖిల్ హీరోగా చేస్తుంది. అటు తమిళంలో కూడా ఆమెకు భారీగానే ఆఫర్లు రావడంతో తెలుగు లో భారీగా రెమ్యూనరేషన్ పెంచింది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: