కానీ కొన్ని సీన్లు షూట్ జరిగాకా ఆ మూవీ అలా ఆగిపోయింది. దానికి కారణం ఆ మూవీలో ద్రౌపదిగా నటించిన సౌందర్య కన్నుమూశారు. ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో 2004 ఏప్రిల్ లో దుర్మరణం పాలు అయ్యారు. అంటే మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడితే నెల రోజుల్లోనే ఆమె లేరని వార్త వచ్చింది. దాంతో బాలయ్య ఆ సినిమాను పక్కన పెట్టేశారు. నిజానికి నర్తనశాలకు చాలా ముఖ్యమైన పాత్ర ద్రౌపది. ఆ రోల్ వేయాలంటే ఆమె తప్ప రీప్లేస్ మెంట్ లేదని బాలయ్య గట్టిగా భావించి సినిమానే ఆపేశారు.
ఇక కొన్నేళ్ళకు భీముడు పాత్రధారి శ్రీహరి కూడా కన్నుమూశారు. నిజానికి భీముడుగా శ్రీహరి యాప్ట్. ఇపుడు ఆ సినిమాలో నాడు తీసిన కొన్ని సన్నివేశాలను జనం ముందుకు తీసుకురావలాని బాలయ్య నిర్ణయించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఈ నెల 24న ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఈ సినిమాలో అందరూ ఉంటారు అంటూ ఒక హింట్ వదిలాడు. పెద్దాయన ఎన్టీయార్ లేకుండా పౌరాణిక చిత్రమా అంటూ ఒక ఆసక్తిని రేకెత్తించారు. అంటే సీనియర్ ఎన్టీయార్ ఈ మూవీలో ఎక్కడో ఒక చోట కనిపిస్తారు అన్న మాట. నిజంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజావే మరి.