అల వైకుంఠపురంలో బ్లాక్బస్టర్ తర్వాత పూజా హెగ్డే అంటే ప్రేక్షకుల్లో కంటే.. ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. అల్లు అరవింద్ అ యితే.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిలైపోవాలంటూ పూజాను రిక్వెస్ట్ చేశాడు. తెలుగు సినిమాకు ఆరాధ్య హీరోయిన్గా మారిన పూజా తెలుగులో రాధే శ్యామ్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నటిస్తోంది. హిందీలో 'సర్కస్' మూవీలో రణ్వీర్సింగ్తో జత కడుతోంది.
పూజా హెగ్డే క్రేజ్ను తమిళ తంబీలు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మాస్టర్తో హిందీలోకి అడుపెట్టిన విజయ్ అక్కడి మార్కెట్ కోసం.. పూజా హెగ్డేపై కన్నేశాడు. నయనతారతో కోలామావు కోకిల వంటి హిట్ మూవీ తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా పూజా దాదాపు ఖరారైనట్టే. ఈలెక్కన అటు హిందీ.. ఇటు అరవ మూవీతో.. టాలీవుడ్కు పూజా డేట్స్ దొరకడం కష్టమే.
సరిలేరునీకెవ్వరు.. భీష్మ వంటి వరుస హిట్స్తో కోటిన్నర రెమ్యునరేషన్కు వెళ్లిపోయిన రష్మిక మందాన్నా ఈ మధ్యనే 'మిషన్ మంజు' అనే మూవీతో హిందీలో అడుగుపెట్టింది. కార్తీతో జత కట్టిన సుల్తాన్తో కోలీవుడ్ను కూడా కవర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప వంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఈ అమ్మడిపేరు వినిపిస్తున్నా.. డేట్స్ ఎడ్జెస్ట్ అవుతాయో లేదో మరి. ఇలా.. హిందీ, తమిళ ఆఫర్స్తో.. రష్మిక, పూజా తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోతారేమో.మొత్తానికి పూజా, రష్మిక ఇక తెలుగులో నటించేది లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం.. ముందు ముందు ఆ ముద్దుగుమ్మలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.