ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరోకి కలిసి వచ్చిన సంఘటనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ హీరోలతో నిండిపోయింది. దీనితో వీరి మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ఒకరు రిజెక్ట్ చేసిన కథను వేరొక యంగ్ హీరో వెంటనే అందుకుంటున్నాడు.


గతంలో ఒక రచయిత రాసిన కధకు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రాసేవారు. ఇప్పుడు ఇండస్ట్రీ వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ఒక కథ ఒక హీరోకు తప్ప మరొక హీరోకు సూట్ కాదు అనే వ్యహారం పూర్తిగా మారిపోయింది. ఒకే కథను సంప్రదించే ప్రతి హీరోకి నచ్చే విధంగా దర్శకులు చిన్నచిన్న మార్పులు చేసి ఆ హీరోలకు వినిపించి తాము వ్రాసుకున్న కథను వృధా కాకుండా జాగ్రత్త పడుతున్నారు.


ఇప్పుడు అలాంటి వ్యవహారమే మళ్ళీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నాని తిరస్కరించిన కథ వైష్ణవ్ తేజ్ కాంపౌండ్ కు చేరినట్లు తెలుస్తోంది. ఒక యంగ్ డైరెక్టర్ వ్రాసుకున్న ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కథను నిర్మించాలని నిర్మాత బోగవిల్లి ప్రసాద్ ప్రయత్నిస్తే నాని తిరస్కరణతో ఆమూవీ ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్ ఇంటికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.


మూవీ కథ నచ్చడంతో పాటు అతడికి నిర్మాత ప్రసాద్ ఆఫర్ చేసిన మూడు కోట్ల పారితోషికం కూడ బాగా నచ్చడంతో వైష్ణవ్ తేజ్ ఆ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పాడని టాక్. ఇది ఇలా ఉండగా ‘ఉప్పెన’ సాధించిన ఘన విజయంతో ఆ మూవీ నిర్మాతలు వైష్ణవ్ తేజ్ కు కోటి రూపాయలు అదనపు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి కి కూడ ఈ మూవీ నిర్మాతలు అదనంగా మరో 25 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అవ్వడంతో కృతి శెట్టి లేకుంటే ‘ఉప్పెన’ సినిమా ఉండదు కాబట్టి ఆమెకు తక్కువ ఇచ్చి వైష్ణవ్ తేజ్ కు ఎక్కువ ఇవ్వడం ఏమిటి అంటూ ఇండస్ట్రీలో కొందరు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: