సీనియర్ నటుడు నరేష్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. విజయనిర్మల నట వారసుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్ కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. వయస్సు ఐపోతున్న కొద్దీ హీరో పాత్రలు తగ్గించి ప్రత్యేక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు.. హీరో హీరోయిన్ పాత్రలకు తండ్రి పాత్రలుర చేస్తూ ఈ వయసులోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..

 ఇక ఆయన గత రెండు సంవత్సరాలుగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మా అసోసియేషన్ ఎన్నికలలో నరేష్ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఘనవిజయం సాధించారు.. శివాజీతో ఆయనకు ఉన్న విభేదాలను ఇప్పుడు మనం చెప్పుకోకపోవడమే మంచిది.. ఓవైపు మా అసోసియేషన్ అధ్యక్ష పదవిని కొనసాగిస్తూ,  మరో వైపు సినిమాల్లో నటిస్తూ,  ఇంకోవైపు తన బిజినెస్ లను చూసుకుంటూ నరేష్ రోజు రోజుకి దూసుకెళ్తున్నాడు.. ఇకపోతే తాజాగా తనని ఓ బిజినెస్ విషయంలో మోసం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు..

బిజినెస్ విషయంలో కి స్టోస్  కంపెనీ తనని ఏడున్నర కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేష్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి  కీ స్టోన్స్ ఇన్ఫ్రా  కంపెనీల పేరుతో తన బిల్డర్ తో ఫీనిక్స్ లో  అసోసియేట్ సైనింగ్ అతా రిటి గా  ఉన్నాడని,  తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్  ఫైనాన్స్ ద్వారా తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఆరేళ్లుగా అడుగుతున్న అప్పటికీ పట్టించుకోవడం లేదని అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు..   నరేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: