ఈ సంవత్సరం విజయ్ అభిమానులు మళ్ళీ రాబోతున్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని ముందు నుంచి వేసుకున్న ప్లాన్ కు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగులుతున్నాయి. దీనితో మళ్ళీ అభిమానులు సోషల్ మీడియా హడావిడితోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గత కొంతకాలంగా విజయ్ సినిమాలు ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇతడు చేస్తున్న ‘లైగర్’ మూవీ పై అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపు కుంటున్న ఈమూవీతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది. దీనితో బాలీవుడ్ ప్రేక్షకులు విజయ్ పట్ల ఎలా స్పందిస్తారో అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సస్ తరువాత ఈమూవీని పూరీ జగన్నాథ్ చాల శ్రద్దగా తీసాడు అన్న వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ చాల గ్రాండ్ గా ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీకి కరణ్ జోహార్ సహ నిర్మాతగా ఉండటంతో బాలీవుడ్ లో విజయ్ ప్రమోషన్ చాల గ్రాండ్ గా ఉండే ఆస్కారం ఉంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈ మూవీకి ఇప్పటి నుండే హైక్ తీసుకు రావడానికి ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విజయ్ పుట్టినరోజునాడు విడుదల చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలే నిజం అయితే పుట్టినరోజునాడు విజయ్ దేవరకొండ అభిమానుల హంగామా తారా స్థాయిలో ఉండవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి..