సినిమా ఇండస్ట్రీలో అయినా కొంచెం ఫేమ్ రాగానే హీరోయిన్ లు రెమ్యునరేషన్ పెంచడం, యాడ్స్ లో నటించడం, షాప్ ఓపెనింగ్ కి వెళ్ళడం వంటివి చేస్తూ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకునే దిశగా హీరోయిన్ లు తమ అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్ బేస్ ను పొందేందుకు ప్రయత్నిస్తుంటారు.  ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధపడే హీరోయిన్ లు ఉన్న ఈ రోజుల్లోహీరోయిన్ మాత్రం కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసినా కూడా ఓ పని చేయడానికి ఒప్పుకోలేదట.

ఆమె అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై తెలుగులో పాటు ఇతర భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమె ఒక ఫెయిర్నెస్ ప్రొడక్ట్ యాడ్ చేసే ఆఫర్ రాగా నిర్మొహమాటంగా ఆ ఆఫర్ కి నో చెప్పిందట. కోటి రూపాయల పారితోషికం పొందే అవకాశం ఉన్న ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ కు ప్రచారం చేయడం ఇష్టం లేక అవికాగోర్ ఆ ప్రకటనకు నో చెప్పింది. అవికా గోర్ తో పాటు మరి కొంత మంది హీరోయిన్లు సైతం కోట్లు ఇస్తామన్నా పలు కంపెనీల బ్రాండ్లకు ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.

మరోవైపు జనాలు సైతం ఫెయిర్నెస్ క్రీములు వాడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. గతంలో సాయి పల్లవి సైతం రెండు కోట్ల ఆఫర్ వచ్చిన రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరు ఏ రంగులో ఉన్న అందంగానే ఉంటారని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సైతం ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు. తన చెల్లి తెల్లగా ఉండదని అలా ఉన్నంతమాత్రాన ఆమె అందంగా లేదని ఏవిధంగా అనగలమని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. నయనతార కూడా యాడ్ కి స్ దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: