టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు టాలీవుడ్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతానికి ఈమె బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ పాత్రలతో పాటు.. ప్రయోగాలు చేసేందుకు సిద్ధపడుతోంది.ఇదే తంతులో" చత్రివాలి" అనే బాలీవుడ్ మూవీలో నటించడానికి ఒప్పుకున్నది.


ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ అనే పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. రకుల్ పై కోంత  అసహనం చూపిస్తుండడంతో.. హీరోయిన్ పై దర్శక నిర్మాతలపై కూడా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు గా సమాచారం వినపడుతోంది. ఈ సినిమాని నిర్మిస్తున్న రోనీ స్క్రూవాలా ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు గా తెలుస్తోంది.


ఇప్పటికే ఈ సినిమాపై పలు సార్లు వివాదం రావడంతో.. ఈ సినిమా విడుదలయ్యేసయానికి ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అందుచేతనే ఈ సినిమాను నుంచి అయన పక్కకి తప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో కొత్త కోణాన్ని ప్రెసెంట్ చేయాలని అని ఎంతో ఆసక్తిగా ఉన్న రకుల్ కు ఇది షాకింగ్ విషయనే చెప్పాలి. అయితే డైరెక్టర్ తేజస్సుకు ఒక కొత్త ప్రొడ్యూసర్ దొరికితే ఈ సినిమాని చేస్తారేమో వేచి చూడాలి...


ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో ఆరు సినిమాలలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక టాలీవుడ్ లో కొండపొలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మధ్య కాలంలో ఈమె డ్రగ్స్ విషయంపై ఈడీ అధికారుల ముందు హాజరు అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా నుండి నిర్మాత  తప్పుకోవడం, ఈడి అధికారులు పిలవడం ఇలా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: