కోలీవుడ్ హీరో విశాల్ అనే పేరు వినగానే తెలుగువాళ్లకు కూడా బాగా ఫ్యామిలియర్‌గానే ఉంటుంది. తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా విశాల్‌కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఆయనకి టాలీవుడ్‌లో ఉన్న అభిమాన ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. విశాల్ నటించే సినిమాలు సాధారణంగా యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు కేవలం ఫైట్‌లు, డైలాగులు మాత్రమే కాదు — ప్రతి ప్రేక్షకుడిని ఏదో ఒక పాయింట్‌లో ఆలోచింపజేస్తాయి కూడా. ఒకప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి, తమిళంలోనే కాదు తెలుగులో కూడా విశాల్ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు సాధించేవి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కొంచెం విరామం తీసుకున్నట్టే కనిపిస్తున్నారు. కొన్ని వ్యక్తిగత విషయాల కారణంగా, అలాగే కొన్ని షోస్, ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. దాంతో కొంతమంది నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి కొంత వెనుకంజ వేస్తున్నారని టాక్. అయితే ఈ అన్ని కాంట్రవర్సీలు పక్కన పెడితే, ఇప్పుడు విశాల్ చేసిన కొత్త కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం దగ్గరలో ఉండే ఆయన ఈసారి నేరుగా నేషనల్ అవార్డ్స్ మీదే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

విశాల్ మాట్లాడుతూ – “నేను ఇప్పుడు ఒక కొత్త జర్నీని ప్రారంభించబోతున్నాను. దీని పేరు ‘యూవర్స్ ఫ్రాంకీ విశాల్’. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నా ఆలోచనలను, నా అనుభవాలను, నా మనసులో ఉన్న నిజాయితీ మాటలను మీతో పంచుకుంటాను. ఇందులో మీకు కావలసిన అన్ని రకాల కంటెంట్ ఉంటుంది,” అని తెలిపారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ, “నా శరీరంపై ఇప్పటివరకు ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 119 చోట్ల గాయాలు పడ్డాయి. యాక్షన్ సీన్స్‌లో రియలిస్టిక్‌గా నటించాలనే ప్రయత్నంలో చాలాసార్లు బలంగా గాయపడ్డాను. ఇటీవల చేతికి లోతైన గాయం కావడంతో 17 కుట్లు వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను నా పనిపై ప్యాషన్ కోల్పోలేదు. ఇక నుంచి సేఫ్టీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటాను,” అని చెప్పారు.అయితే ఆయన చేసిన నేషనల్ అవార్డ్స్‌పై వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.

విశాల్  మాట్లాడుతూ –“నాకు అవార్డులు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వాటిపై నమ్మకం కూడా లేదు. నేను ఎంత కష్టపడి సినిమా చేసినా, కేవలం ఎనిమిది మంది కూర్చొని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదు. కోట్లాది మంది ప్రేక్షకులు ఒక సినిమాను ఇష్టపడతారు. కానీ ఆ సినిమాను ఎనిమిది మంది ఎలా తీర్పు చెబుతారు? జాతీయ అవార్డులకూ ఇదే వర్తిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. నాకు అవార్డు రాకపోవడం వల్లనే నేను ఇలా అనడం లేదు. అవార్డు వచ్చినా కూడా నేను దాన్ని చెత్తబుట్టలో వేసేస్తాను,” అని స్పష్టంగా చెప్పారు.

విశాల్ చేసిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం “విశాల్ నిజాయితీగా మాట్లాడాడు, తన మనసులో ఉన్నది బయటపెట్టాడు” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.ఇక ఇండస్ట్రీ వర్గాల దృష్టిలోకి వస్తే — విశాల్ లాంటి హీరో ఇలా ఓపెన్‌గా నేషనల్ అవార్డ్స్ సిస్టమ్‌పై ప్రశ్నించడం నిజంగా ధైర్యమైన విషయం అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం “ఇలా మాట్లాడడం ఆయనకు భవిష్యత్తులో ప్రొఫెషనల్‌గా నష్టమవుతుందేమో” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: