ఇక ఇప్పుడు మరో సారి ట్రైలర్ తో తన లేటెస్ట్ మూవీ వాల్మీకి కి మంచి హైప్ ను తీసుకురావడం లో విజయం సాధించాడు హరీష్ శంకర్. తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ యూనానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ట్రైలర్ లో వరుణ్ తేజ్ పలికిన సంభాషణలు హైలైట్ అయ్యాయి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్, సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి నటిస్తున్నారు. వీరికి జోడిగా పూజాహెగ్డే , మృణాళిని రవి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ,యంగ్ హీరో నితిన్ గెస్ట్ రోల్ ల్లో మెరవనున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మరి మంచి అంచనాల మధ్య సెప్టెంబర్ 20న విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.