మతఛాందసవాదులకు ఒక ప్రత్యేక దేశం ఇచ్చేసరికి దేశంలో ఆయా మాటలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య గతంలో కూడా ఉగ్రభూతాల వలన మాత్రమే వచ్చింది. ఇప్పుడు కూడా దేశం వచ్చింది, ఇక ప్రపంచంలో ఉన్న తమ మతస్తులను నయానో భయానో తమవైపు మళ్ళించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ నియమాలతోనే పాక్, ఆఫ్ఘన్, ఇరాన్ లాంటి దేశాలు నడుస్తున్నాయి. అందుకు వాళ్ళు బయపెడతారా మరొకటి చేస్తారా అనేది తరువాతి విషయం. ముందు వాళ్ళు విస్తరించడానికి పూర్తిగా శక్తులను వాడుతున్నారు. రెండు ఇతర మాటలపై దాడులు, ముఖ్యంగా భారత్ పై కన్ను కాబట్టి హిందూ మతంపై వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచంలో తోపులం అని చెప్పుకుంటూ తిరిగిన రష్యా, అమెరికాలకు తాలిబన్ లు చుక్కలు చూపించారు కాబట్టి ఇంకా లైన్ లో ఉంది భారత్ మాత్రమే. చైనా మధ్యలో ఉన్నప్పటికీ దాని పని కరోనా తో అయిపోయిందని వాళ్ళు భావించి ఉండవచ్చు.

ఈ నేపథ్యంలోనే భారత్ లో ఉన్న ఐకమత్యాన్ని నాశనం చేసేందుకు పండుగల సమయంలో ఆయా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇప్పుడు దేశంలో జరుగుతున్నాయి. భారత్ ను దెబ్బకొట్టాలి అంటే ప్రతి స్లీపర్ సెల్ మానవ బాంబు అవ్వాల్సిన పని లేదు, మతాలను రెచ్చగొట్టే వాడు అయితే సరిపోతుంది అనే సున్నిత విషయాన్ని తాలిబన్ లు, పాక్ సహా పలు భారత ఓటమి చూడాలనుకునే దేశాలు అన్ని కలిసి ఈ తరహా దాడులను దేశంలో చేయడానికి పూనుకున్నట్టే ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తుంటే అర్ధం అవుతుంది. ఒకపక్క దేశం అంతటా పండుగలు జరుగుతున్నాయి. దుర్గాష్టమి నుండి అన్ని పండుగలు ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలకు పూనుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాజాగా ఆయా దేశాలలో హిందువులు జరుపుకుంటున్న దుర్గ పూజలపై, ఆయా మండపాలపై గుర్తు తెలియని వారు దాడులు చేసినట్టు తెలియవస్తుంది. దానికి కారణం మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి అని స్పష్టంగా తెలుస్తుంది. దీనిని గ్రహించి, ప్రతి హిందువు సహా భారతీయులందరు సంయమనం పాటిస్తూ మతపరమైన ప్రార్థనలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగర్తగా ఉన్నా కూడా ఈ పరిస్థితులను ఉగ్రభూతాలు వాడుకుని దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా మానవ బాంబులు పెట్రేగిపోయే అవకాశాలు ఉన్నట్టు వారు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: