ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనలో భాగంగా భారత్ కు విచ్చేసిన సంగతి విదితమే... అయితే భారత్ కు వచ్చినపుడు తనకు లభించిన అపూర్వ ఆదరణను ఆయన ఇంకా మరచిపోలేకపోతున్నారు. ఈ పర్యటన ముగిసిన వారం రోజులు కావస్తున్నా ఆ జ్ఞ‌ాపకాలు ఆయన కళ్ల ముందు ఇంకా మొదలుతున్నాయి. 

 

భారత పర్యటన ముగిసిన తర్వాత తొలిసారి దక్షిణ కరోలినాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత పర్యటనలో తనకు లభించిన స్వాగతం గురించి ప్రస్తావించారు. ఇంకా.. ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ఆకాశానికెత్తేశారు. తన దేశ ప్రజలు ఎంతగానే ప్రేమించే మోదీ ఓ గొప్ప వ్యక్తని పొగడ్తల్లో ముంచెత్తారు.  భారత్ నుంచి వచ్చిన తర్వాత తన సభలకు భారీగా జనం హాజరైనా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

 

నేను భారత ప్రధాని మోదీతో కలిసి సభలో పాల్గొన్నారు. నేను స్టేడియం లోపలికి వెళ్లేసరికి భారీగా జనం ఉన్నారు. సాధారణంగా నేను తక్కువ మంది సమూహంలో మాట్లాడటానికి ఇష్టపడతాను.. కానీ, 60,000 మంది జనం మధ్య మాట్లాడి ఇక్కడకు వచ్చాను. అంటూ అహ్మదాబాద్ సభకు హాజరైన జనసందోహం గురించి పర్యటనలో మాట్లాడారు.

 

 

ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధులు ట్రంప్ వెంట వచ్చారు. తొలుత అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ దంపతులకు అక్కడ ఘన స్వాగతం లభించింది. మోతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి లక్షకుపైగా జనం హాజరయ్యారు. ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లిన ట్రంప్ దంపతులకు వేలాది మంది విద్యార్థులు అమెరికా, భారత్ జెండాలను చేతబట్టి దారికి ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు

మరింత సమాచారం తెలుసుకోండి: