టిడిపి యువ నాయకుడు ఆ పార్టీ కాబోయే రథసారధి నారా లోకేష్ పై తరచుగా విమర్శలు చేస్తూనే ఉంటారు వైసిపి నాయకులు. ఆయనపై విమర్శలు చేయకపోతే ఏదో వెలితిగా ఉంటుందో ఏమో తెలియదు గానీ, వరుసగా అందరూ లోకేషన్ టార్గెట్ చేసుకుంటూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అందరికంటే ఘాటుగా,  విమర్శలు చేసే ఏపీ మంత్రి కొడాలి నాని లోకేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు పైన ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కువ పెడుతూనే. వస్తున్నారు. లోకేష్ కు అసలు వరి చేనుకు చేపల చెరువు కూడా తేడా తెలియదంట అంటూ నాని ఎద్దేవా చేశారు. లోకేష్ ఒక వేస్ట్ ఫెలో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై అదేపనిగా  విమర్శలు చేస్తూ వస్తున్న లోకేష్ పై నాని స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన సమయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పెరిగాయని, 55 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్రం ఒప్పుకుందా అనే విషయాన్ని నాని గుర్తు చేస్తున్నారు.  


రాష్ట్రంలో లోకేష్ ఎంత తెలివైన వాడిగా నిరూపించుకున్నా, తెలుగుదేశం పార్టీకి ఉపయోగం ఉండదని , అమరావతిలో ఉన్న రైతులు మాత్రమే రైతులు కాదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు కాబట్టి ,తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా ఇప్పుడు అనవసర హడావుడి చేస్తూ ఆందోళన చెందుతున్నారని ఆయన దుయ్యబట్టారు.


రైతులకు బేడీలు వేశారని అనుమానం వ్యక్తం చేసిన జగన్ దేవినేని ఉమా,  మరి బషీర్ బాగ్ కాల్పులు ఘటన కు తనను తాను పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పైన , తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొద్దిరోజులుగా లోకేష్, టిడిపి పై విమర్శలు జోరు తగ్గించి  సైలెంట్ గానే ఉంటూ వస్తున్న నాని మరోసారి ఐలా మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: