బీజేపీ పార్టీ ఏపీ లో రోజు రోజు కి కొంత బలపడుతున్న సంగతి తెలిసిందే..రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌లతో ఉన్న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. ఆదిశ‌గా కావాల్సిన కార్యాచ‌ర‌ణ‌ను త‌న‌దైన శైలిలో అమ‌లు చేస్తోంది. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి..  ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయ‌కుల‌ను బీజేపీ సార‌థులుగా నియమించింది.

దీంతో పాటు స‌ద‌రు నాయ‌కులకు వాగ్ధాటి కూడా ఉండ‌డం పార్టీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామం. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయమని సోము కి కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందట.. అందుకే తగ్గట్లే  ఎవ‌రిపై అయినా విమ‌ర్శలు చేయ‌డంలో వీర్రాజుకు ఏ మాత్రం మొహ‌మాటం ఉండ‌దు అన్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కంటే ముందుగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు.. ఇక టీడీపీ కూడా మోడీ కి దగ్గరయ్యే ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు.. అవసరం ఉన్నా లేకున్నా మోడీ పేరు తీసుకువచ్చి మోడీ పై తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నాడు..

అయితే దీన్ని వ్యతిరేకించడం లో సోము వీర్రాజు పూర్తి గా విఫలమయ్యాడు అని అంటున్నారు బీజేపీ క్యాడర్ సభ్యులు.. సోష‌ల్ మీడియాలో ఆయనపై చాలా ఆసక్తికరమైన ఆస‌క్తిక‌ర కామెంట్లు ప‌డుతున్నాయి.ఆయ‌న మైకు ముందుకు వ‌స్తే.. పూన‌కం వ‌చ్చిన వ్యక్తిగా ఊగిపోతార‌ని.. మైకు ముందుకు రాకుంటే.. వాన‌పాములా మారిపోతారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీలో చేరే వారు కూడా పార్టీ కోసం క‌ష్టప‌డే ప‌రిస్థితి లేదు. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న పార్టీని ఉన్నత పార్టీగా తీర్చిదిద్దాలంటే ఎంతో క‌ష్టప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి దీనికి త‌గిన విధంగా ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల్సిన సోము వీర్రాజు.. మైకు క‌నిపిస్తే.. రెచ్చిపోతున్నారు లేకపోతే ఆగిపోతున్నారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: