కామాంధుల వావి వరుసలు అవసరం లేదు.. వారి కోరిక తీరడానికి ఒక ఆడది అయితే చాలు. చట్టాలు ఎన్ని కొత్తగా తీసుకొస్తున్నా కూడా కామాంధుల లో మాత్రం మార్పు లేదు.. ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నార్త్ లో మరి ఎక్కువగా సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి.. చట్టాలు మారిన, ప్రభుత్వాలు మారిన, పోలీసులు కొత్త శిక్షలు వేసినా కూడా కామంతో ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్న వారిలో మాత్రం మార్పులు రాలేదు.. ఎంత చేసిన కూడా వారి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. పనిమనిషి తో ఓ డాక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణంగా మోసం చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. 



వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది..చంద్రమౌళినగర్‌కి చెందిన యువతి ప్రత్తిపాడు మండలం యనమదలలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వంటమనిషిగా పనిచేసేది.పీజీ చేస్తున్న డాక్టర్ తనపై అక్టోబర్ 12న అత్యాచారం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బయటకు చెప్పలేదని యువతి తెలిపింది. కొద్దిరోజుల అనంతరం తన స్నేహితులను పిలిపించి వారితో కూడా పడుకోవాలని కోరాడు..దానికి ఆమె ఒప్పుకోక పోవడంతో యజమాని కూతురు, అతని స్నేహితులతో కలసి కొట్టి గదిలో నిర్బంధించారని పేర్కొంది. చివరకు విషయం ఇంటి యజమానులకు తెలిసినా పట్టించుకోకపోగా తనని దారుణంగా కొట్టి బెదిరించారని చెప్పుకొచ్చింది.



బాగా దారుణంగా కొట్టడంతో స్పృహతప్పి పడిపోవడంతో వెళ్లిపోయారని.. ఎలాగో వారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని ఆమె పోలీసులకు చెప్పింది.తనపై అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన డాక్టర్, అతని స్నేహితులు, ఇంటి యజమానులపై చర్యలు తీసుకుని తనకు  న్యాయం చేయాలని పోలీసుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది.భాదితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: