తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ తీవ్ర విమర్శలు చేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా రాజ్యం నడుస్తుంది అని మండిపడ్డారు. ప్రజలెవ్వరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపెడుతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారు అన్నారు. అవినీతి అక్రమాలకు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ లు చేస్తున్నారు అని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారు అని విమర్శించారు. ఐపియస్ లు చట్టానికి లోబడి పని చేయాలే తప్ప.. ప్రభుత్వానికి అనుకూలంగా చేయకూడదు అని ఆయన హెచ్చరించారు.
అధికార పక్ష నాయకుల వ్యాఖ్యలు మీకు కనిపించవా అని కేశినేని నానీ నిలదీశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు పై అక్రమంగా కేసులు పెడుతున్నారు అని కేశినేని నానీ మండిపడ్డారు. అబ్దుల్ సలాం ఉదంతం అందరనీ కలచివేసింది అని అన్నారు. వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. ఈ రోజు అబ్దుల్ సలాం కి న్యాయం చేద్దాం అని చూస్తే అందరిని హౌస్ అరెస్ట్ చేశారు అని ఆయన మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ అందరికి అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతుంది అన్నారు.