ఈ మధ్యకాలంలో ప్రేమించడమే పాపం గా మారుతుంది. ఎందుకంటే ప్రేమ జంటలు ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  ఇక తక్కువ కులం వాడిని ప్రేమించారు  అని కోపంతో ఏకంగా కన్న తల్లిదండ్రులే  పేగు బంధాన్ని మరచి ఉన్మాదులు గా మారిపోయి  దారుణంగా సొంత పిల్లలను హత్యచేసిన ఘటనలు  ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ప్రేమ జంటలు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక విడిపోయి ఉండలేక ఇక చావులో అయినా  ఒక్కటవుదాం అని అనుకొని చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన లో మరికొన్ని.



 ఇలా ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.  తల్లిదండ్రులను ఎదిరించి లేక ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడటం రెండు  కుటుంబాల్లో  తీవ్ర విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పక్క పక్క ఇళ్లలోనే  ఉండే యువతీ యువకులు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కొన్ని రోజుల్లోనే పరిచయం ప్రేమగా మారి పోయింది ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఈ ప్రేమ జంట ఒక్కటవ్వాలి అని అనుకున్నారు.



 కానీ వారి ప్రేమ విషయం చెప్పేందుకు ధైర్యం సరిపోలేదు. చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీరామ్ సుజాత అనే యువతి యువకులు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఇక వీరిద్దరికీ చిన్నప్పటి నుంచీ పరిచయం ఉండగా గత కొంత కాలంగా వీరు మధ్య ప్రేమ పుట్టింది. ఇక వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఒప్పుకుంటారో లేదో అని ఆందోళన చెందారు.చివరికి తమలో తామే కుమిలిపోయి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఊరి చివరలో పురుగుల మందు తాగి  ఆత్మహత్య యత్నం చేయగా గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో  మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: