ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది జగన్ను విమర్శించి బయటకు వెళ్తుంటే.. ఆ పార్టీలోనే ఉండి కొంతమంది జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచితనం వల్ల మేము సంక నాకి పోయామంటూ హాట్ కామెన్స్ చేశారు.

 2019 నుంచి 2024 మధ్యలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక డిష్ టైలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని వివరించారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా వైసిపి నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టల్లరీ లు మొత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి చుట్టాలవి అంటూ... తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన దేవుడు ఉన్నాడు.... కింద ప్రజలు ఉన్నాడు అని జగన్ మోసపోయాడని వెల్లడించారు.

 కానీ మధ్యలో నారా చంద్రబాబు నాయుడు... నందిని పంది చేసి చూపిస్తున్నాడని ఫైర్ అయ్యారు. అలాంటి చంద్రబాబు నాయుడును తక్కువ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి బోల్తాపడ్డాడని తెలిపారు. అందుకే వైసిపి నాయకులు అందరికీ ఈ కర్మ పట్టిందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇకనైనా చంద్రబాబు నాయుడు ను... పసిగట్టి వెంటాడాలని సూచించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: