తనకు ఎందుకు మైక్ ఇవ్వలేదు అని, అసలు విపక్ష నేతగా అన్నేళ్ళు పని చేసిన తనకు మైక్ ఇవ్వలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. బడ్జెట్ అంతా కూడా అంకెల గారడీ అని అన్నారు. మూలధన వ్యయంలో సగం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 

 

అసెంబ్లీ ని బిల్లులు పాస్ చేసుకోవడానికి ఏర్పాటు చేసారని ఆయన మండిపడ్డారు. జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలు చూపలేదు, అప్పుల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఏడాది పాలనలో అభివృద్ధి అనేది లేదని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చరిత్రలో జరగలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం బడ్జెట్ మీద తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: