విశాఖపట్నంలో మరోసారి ఎల్జీ పాలిమర్స్ ని టార్గెట్ చేసారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితుల సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని ప్లకార్డు  ప్రదర్శించి నినాదాలు చేసారు. సంఘీభావం ప్రకటించి.. నిరసన కార్యక్రమంలో సీపీఎం సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను అందర్ని ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు.

ఘటన జరిగిన తర్వాత గ్యాస్ ప్రభావంతో చాలా మంది అనారోగ్యానికి గురి అయ్యారు, మరి కొంత మంది చనిపోయారు అన్నారు. వీరెవర్ని ప్రభుత్వం పట్టించుకోలేదని... ఆర్ధిక సహాయం చేయలేదని మండిపడ్డారు. బాధితుల అందర్ని ఆదుకునే వరకు వారి తరుపున పోరాడుతామని స్పష్టం చేసారు. జనవాసాల మధ్య ఉన్న ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని తరలించాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: