మధుమేహంతో బాధపడేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తమ సమస్యని నయం చేసుకోలేరు. అయితే కొన్ని సహజ ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడొచ్చు. షుగర్ తో బాధపడేవారు కొన్ని పానియాలు తాగితే చాలా మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంది. అంతేకాదు ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. తులసి డిటాక్స్ డ్రింక్ తయారీకోసం ఒక గ్లాసు నీటిలో 6 నుండి 8 తులసి ఆకులను వేయండి. బాగా వేడి చేయండి. అనంతరం ఆ నీటిని చల్లార్చి తాగండి.అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో అల్లం వేయండి. ఆ నీటిని బాగా మరిగించండి. దీని తరువాత ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.


మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి.. ఆ నీటిని తాగండి.మధుమేహంతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క చాలా మంచిది. దీని కోసం, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.వేప నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు వరం వంటిది. వేప ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ డిటాక్స్ డ్రింక్ తయారీకి కోసం ఒక గ్లాసు నీటిలో 7 నుండి 8 వేప ఆకులను వేసి.. ఆ నీటిని మరిగించాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. ఈ నీటి రుచి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: