యువనటుడు శర్వానంద్ నటించిన విమర్శనాత్మక ప్రశంసలందుకున్న ప్రస్థానం చిత్రం 2010వ సంవత్సరంలో విడుదలైంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో కథ చెప్పిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంది. 
 
చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమా తీసిన విధానం నచ్చి బాలీవుడ్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఈ విషయంపై సంజయ్ దత్ దేవా కట్టాతో చర్చల్లో ఉన్నాడు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం రాబోతుంది. 
 
ఈ మధ్య కాలంలో దేవా కట్టా తీసిన సినిమాలు విజయవంతం కాకపోయినప్పటికీ ప్రస్థానం చిత్రం సంజయ్ దత్ కు విపరీతంగా నచ్చేసింది. సంజయ్ దత్ ఇంతకుముందు జిలా ఘాజిబాద్, కాంటే, ఖల్నాయక్ థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న భూమి చిత్రంలో ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్నాడు. అదితీ రావ్ హైదరీ కూతురిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: