అనుష్క శెట్టి ఈ పేరు తెలియాని వారుండరు. తనదైన నటనతో అందరి మనసుల్ని గెలుచుకుంది. అనుష్క చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్‌లే ఉన్నాయి. అయితే అరుంధతి సినిమాతో అనుష్క భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో స్వీటీ లేడీ సూపర్ స్టార్‌ హోదాను సంపాదించుకుంది. ఆ తరువాత అమ్మడి కోసం ప్రత్యేకంగా లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా సిద్దం చేశారు. వాటిలో అమ్మడు కొన్నింటిలో నటించింది. పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం సినిమాలు ఈ కోవలోవే. అయితే ఈసినిమాలు అరుధంతి రేంజ్ హిట్‌ను అందుకోలేక పోయాయి. వీటిలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క చేసిన ప్రయోగం కూడా అంత మంచి ఫలితాన్ని అందించలేక పోయింది.


ఆ తరువాత వచ్చిన నిశ్శబ్దం సినిమా కూడా అదే విధంగా నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అనుష్క మరో సినిమాను ప్రకటించలేదు. అయితే తాజాగా యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు మేకర్స్ వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారంటూ ఓ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమా ఓ 40 ఏళ్ల అమ్మాయి ఓ కుర్రాడి మధ్య సాగే ప్రేమ కథ అన్ని విషయం తెలిసిందే.
 ఇటీవల ఈ సినిమాకు ‘మిస్ శెట్టి ..మిస్టర్  పొలిశెట్టి’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు సినీ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. 'నిశ్శబ్ధం' తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాకు ఈ పేరు ఫిక్స్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: