హిందూపూర్ ఎమ్మెల్యే, నరసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులను ప్రాణంగా చూసుకుంటారు అనే విషయం తెలిసిందే. అభిమానులకు ఏదైనా కష్టం వచ్చింది అని తెలిస్తే వెంటనే వారి ముందు వాలి పోతాడు. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి మరో నిదర్శనంగా నిలిచింది.

బాలయ్య బసవతారకం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానులు కన్వీనర్ ను కలిశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ "మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న... ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నా అభిమాని, అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల కన్వీనర్ నంబూరి సతీష్ గారిని సందర్శించాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవునికి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ... మీ నందమూరి బాలకృష్ణ" అని పోస్ట్ చేశారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఎంతమంది పేదలకు కు వైద్యం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొదటి భార్య బసవతారకం క్యాన్సర్ తో మరణించింది. అప్పట్లో ఆమె జ్ఞాపకార్థం హైదరాబాదులో ఈ క్యాన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ ను స్థాపించారు. అప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ ఈ హాస్పిటల్ బాధితులను చేపట్టారు. దీని ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. తాజాగా బాలయ్య తన అభిమానులను కలవడానికి ఆస్పత్రికి స్వయంగా వెళ్లడంపై నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బాలయ్య "అఖండ" చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయన 'అఘోరీ'గా నటిస్తున్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన "రోర్ ఆఫ్ అఖండ" వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. "అఖండ" సినిమా విడుదల గురించి ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: