ప్రస్తుతం బుల్లితెరపై ఒక సెన్సేషనల్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రతి ఒక్కరికి నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం లో  లేడీ కంటెస్టెంట్ అసలు ఉండేవారు కాదు. ఇక లేడీ గెటప్ లను కూడా మగవారే వేసుకుని జబర్దస్త్ కమెడియన్స్  కామెడీ పండించే వారు. కానీ ఇటీవలి కాలంలో జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు.  ఇక తమదైన శైలిలో కామెడీ పంచుతూ బాగా ఫేమస్ అయిపోతున్నారు. అయితే ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించిన లేడీ కంటెస్టెంట్స్ ఎవరు అంటే రోహిణి, వర్ష అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక వీరిద్దరూ కూడా అటు జబర్దస్త్ లో తమదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకుల అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు అనే చెప్పాలి. అయితే సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ ఒకరి పై ఒకరు ఎప్పుడు పంచులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కానీ ఇటీవల ఇలా ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడమే వర్ష, రోహిణి మధ్య పెద్ద గొడవకు కారణం అయింది. జబర్దస్త్ లో ఎంతో ఫేమస్ అయిన వర్ష రోహిణి ఇటీవలే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు..



 ఈ ప్రోమోలో భాగంగా వీరిద్దరూ దారుణంగా గొడవ పడటం ఒకరిపై ఒకరు పర్సనల్ కామెంట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఒక టాస్క్ ప్రారంభంలో భాగంగా బండా అంటూ రోహిణిని పిలుస్తుంది వర్ష. నువ్వు ఇంకోసారి అలా పిలిచావ్ అనుకో నాకు అస్సలు నచ్చదు అని వార్నింగ్ ఇస్తుంది రోహిణి .  నువ్వు ఉన్నావు అంటేనే ఇక్కడికి రావద్దు అనుకున్నాను నీ ముందు నిలబడటం కూడా నాకు నచ్చదు అంటూ రోహిణి షాకింగ్ కామెంట్స్ చేసింది..  ఇక నుంచి నువ్వు ఉన్న ఏ షో కి కూడా నేను రాను అని చెబుతోంది.  నువ్వు సన్నగా ఉండొచ్చు నా ఒళ్ళు ఇంతే ఇలాగే ఉంటాను కానీ..అలా పిలిచావ్ అనుకో అస్సలు బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తుంది రోహిణి .  దీంతో ఇక వర్ష ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలోనే కోపం తో  యాంకర్ సుమ కూడా స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: