నందమూరి నట సింహం అయిన బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న యాక్షన్ ఫిల్మ్ అఖండ . ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా..

ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యిందని సమాచారం.దీంతో ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది.. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనీ చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది చిత్రబృందం.

ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోందని తెలుస్తుంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని సమాచారం.ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ వినిపిస్తుంది.. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. సినీ పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అలాగే ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉందట. అఖండలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోందని అందరికి తెలుసు.

ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్ మరియు స్టార్ మా దక్కించుకుందని ప్రచారం జరుగుతోందట. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారని ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారని తెలిసిన విషయమే..

ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారని తెలుస్తుంది.. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం.. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైందని తెలుస్తుంది.

గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు మరియు పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు . ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ మరియు పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష నటించనుందని సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి: